తెలంగాణలో బీజేపీ 3వ స్థానంలో ఉంది – కపిలవాయి దిలీప్

-

తెలంగాణలో బీజేపీ 3వ స్థానంలో ఉందని బీజేపీ సీనియర్‌ నాయకులు కపిలవాయి దిలీప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీఆరెస్ పార్టీతో పోలిస్తే బీజేపీ పార్టీ థర్డ్ పొజిషన్లో ఉందని బాంబ్‌ పేల్చారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి లీడర్లు వేస్తే మాకు బలం వస్తుంది అనుకున్నామని… కానీ ఈటెల రాజేందర్ ఫెయిల్ అయ్యాడని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ సీనియర్ నేత కపిలవాయి దిలీప్. ఇతర పార్టీ నుంచి నేతలు వస్తే.. బీజేపీ పార్టీ పుంచుకుంటుందని చెప్పారు బీజేపీ సీనియర్‌ నాయకులు కపిలవాయి దిలీప్.

Kapilawai Dileep

ఇది ఇలా ఉండగా, అటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణా రావు బీజేపీలో చేరడం కష్టమేనని ఈటెల రాజేందర్ నిన్న అన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు వారిని కాంగ్రెస్ పార్టీలో చేరకుండా ఆపగలిగాను. పొంగులేటి, జూపల్లితో నేను రోజూ మాట్లాడుతున్నాను. బీజేపీలో చేరమంటే వారే నాకు రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నారని వెల్లడించారు ఈటెల రాజేందర్.

Read more RELATED
Recommended to you

Latest news