మంచిర్యాల పర్యటనలో మరోసారి కల్వకుంట్ల కవిత చిట్చాట్ లో మాట్లాడారు. ఈ సందర్బంగా గులాబీ బాస్ కేసీఆర్ పై కవిత చిట్చాట్ లో మాట్లాడారు. నాకు సొంత అజెండా ఏమీ లేదన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవద్దన్నదే నా వాదన అని పేర్కొన్నారు కల్వకుంట్ల కవిత. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదని… నేను కేసీఆర్ని కలవాలని చాలా ప్రయత్నించానని పేర్కొన్నారు.

కేసీఆర్ను కలిసే అవకాశం వచ్చింది.. కానీ, కలవలేకపోయాను… లెటర్ బయటపెట్టిన వారిని ముందు పట్టుకోండి అని స్పష్టం చేశారు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్కు నోటీసు ఇస్తే బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎందుకు స్పందించలేదు? అని నిలదీశారు. కేసీఆర్కు కుటుంబం కంటే ప్రజలంటేనే మక్కువ అన్నారు కల్వకుంట్ల కవిత. నేను జైలులో ఉన్నప్పుడే పార్టీని బీజేపీలో కలుపుతామనే అంశం వచ్చిందని వివరించారు.