సుప్రీంకోర్టులో కవిత కేసు విచారణ వచ్చే నెల 13కి వాయిదా

-

ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి.. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా పడింది. విచారణను వచ్చే నెల 13వ తేదీన జరుపుతామని జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం స్పష్టం చేసింది. కి వాయిదా వేసింది భారత అత్యున్నత న్యాయస్థానం. కాగా.. లిక్కర్ కేసులో ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని కవిత సుప్రీంలో పిటిషన్ వేసింది.. తనపై ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కవిత కోరింది.

అయితే.. సీఆర్పీసీ ప్రకారం మహిళను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కవిత పిటిషన్ దాఖలు చేశారు. తనను ఇంట్లోనే విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. అయితే బుధవారం పిటిషన్పై విచారణ జరగాల్సి ఉండగా.. తగినంత సమయం లేకపోవడంతో కోర్టు వాయిదా వేసింది. విచారణకు తగిన సమయం లేదంటూ మరో తేదీని కేటాయించింది సుప్రీం కోర్టు. పార్లమెంట్ ఎన్నికల వేళ.. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు నోటీసులు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version