కవితకు బిగ్ షాక్… మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించిన BRS

-

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు జాబితాను విడుదల చేస్తున్నా సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించింది. జహీరాబాద్ మరియు నిజామాబాద్ ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు కేసీఆర్. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ బరిలో ఉండనున్నారు.

KCR announced Zaheerabad and Nizamabad MP candidates

అయితే.. తన కూతురు కవితకు నిజామాబాద్ ఎంపీ టికెట్‌ ఇవ్వకుండా…బాజిరెడ్డి గోవర్ధన్ కు ఇచ్చారు కేసీఆర్‌. అటు చేవెళ్ల, వరంగల్ లోక్ సభ స్థానాల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. చేవెళ్ల పార్లమెంటు స్థానానికి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ను ప్రకటించారు.అదే విధంగా నేటి వరంగల్ ముఖ్యనేతలతో జరిపిన చర్చల అనంతరం సమష్టి నిర్ణయాన్ని అనుసరించి వరంగల్ పార్లమెంటు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్యను అధినేత కేసీఆర్ ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news