BREAKING : తెలంగాణ బడ్జెట్ కు కేసీఆర్ మంత్రివర్గం ఆమోదం

-

BREAKING : తెలంగాణ బడ్జెట్ కు కేసీఆర్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తెలంగాణ బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ఈ మేరకు ఆర్థిక మంత్రి హరీష్ రావు కీలక ప్రకటన చేశారు. ఇక రేపు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి హరీష్ రావు.

మంత్రి వర్గం సమావేశం ముగియడంతో సీఎం కేసీఆర్ కాసేపట్లో నాందేడ్ కు బయలుదేరి వెళ్ళనున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి నాందేడ్‌కు బయల్దేరనున్న కేసీఆర్.. బీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో పాల్గొననున్నారు. హైదరాబాద్‌ నుంచి సీఎం కేసీఆర్‌ బయలుదేరి మధ్యాహ్నం 12.30గంటలకు నాందేడ్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వయ్‌లో బయలుదేరి సభా వేదిక సమీపంలోని చత్రపతి శివాజీ విగ్రహం వద్దకు చేరుకుంటారు.

పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి చారిత్రక గురుద్వారాను సందర్శిస్తారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. అక్కడి నుంచి 1.30గంటలకు సభాస్థలికి చేరుకోనున్నారు. సీఎం కేసీఆర్‌ సమక్షంలో మహారాష్ట్రకు చెందిన పలువురు సీనియర్‌ నేతల చేరికలు ఉంటాయి. అనంతరం బీఆర్‌ఎస్‌ నాందేడ్‌ నేతలను ఉద్దేశించి ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ ప్రసంగం ఉండనుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news