కెసిఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి: వైయస్ షర్మిల

-

ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్ఆర్ సీపీ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. యాసంగి వడ్లు కొంటామని మాట ఇచ్చిన కేసీఆర్ ఆ మాటను నిలబెట్టుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు కేవలం 17 శాతం వడ్లు మాత్రమే కొన్నారని విమర్శించారు. వడ్లు తడిసిపోయి రైతులు కన్నీరు పెడుతుంటే… కెసిఆర్ కు చీమకుట్టినట్లు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు షర్మిల.

Sharmila
Sharmila

ఆదుకుంటాను అని చెప్పిన దొరగారు వడ్లు కొనని నైపుణ్యానికి రైతులు ఎకరాకు రూ. 10,000 నష్టం వస్తుందని ఆమె విమర్శించారు. రైతన్నను ఆదుకునేది ఎవరని ప్రశ్నించారు. కళ్ళాల్లోని వడ్లు వర్షాలకు తడిసి పోతే రైతు కన్నీరు తుడిచేది ఎవరని అడిగారు. గొప్పలు చెప్పుకోవడానికే వడ్లు కొంటామని చెప్పినట్టు ఉన్నారని అన్నారు. 7 వేల కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు 500 ఎక్కువ ఇచ్చి కొంటామన్న కేసీఆర్ మాటలు ఎక్కడికి పోయాయి అని షర్మిల మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news