నేను భోజనం చేస్తుంటే 2 సార్లు కరెంట్ పోయింది.. కేసీఆర్ ట్వీట్

-

నేను భోజనం చేస్తుంటే 2 సార్లు కరెంట్ పోయిందని కేసీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో చాలా చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. నేను గంట క్రితం మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి గారు, మరియు మాజీ ఎమ్మెల్యేలతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు రెండు సార్లు కరెంటు పోయిందని రేవంత్‌ సర్కార్‌ పై ఆగ్రహించారు.

ప్రతి రోజు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కరెంటు పోవడం లేదని ఊదరగొడుతున్నారు. నాతోపాటు ఉన్న మాజీ శాసనసభ్యులు వారి వారి నియోజకవర్గాల్లో రోజుకు పదిసార్లు కరెంటు పోతున్నదని ఈ సందర్భంగా నాకు చెప్పారని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలనా వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుంది? తెలంగాణ రాష్ట్ర ప్రజలు, మేధావులు ఆలోచించాలని కోరారు కేసీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news