కేసీఆర్ మమ్మల్ని అవసరానికి వాడుకున్నారు – కూనంనేని

-

సీఎం కేసీఆర్ తమని అవసరానికి వాడుకొని వదిలేసారని ఆరోపించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో రానున్న ఎన్నికలకు సీపీఐ, సీపీఎం పార్టీలు ఉమ్మడిగా వెళుతున్నాయని తెలిపారు. రాజకీయాలలో మోసం చేసే వాళ్ళు ఉన్నంతకాలం మోసపోతూనే ఉంటామని అన్నారు.

Koonanneni

అదేవిధంగా పొత్తుల కోసం తాము ఎప్పుడూ వెంపర్లాడలేదని అన్నారు. మునుగోడులో బిజెపిని ఓడించేందుకే బిఆర్ఎస్ కి మద్దతు తెలిపామన్నారు. తాము కెసిఆర్ ని నమ్ముకుని లేమని.. ఎవరైనా కలిసి వస్తే పోటీ చేస్తామని, లేదంటే ఒంటరిగా వెళ్తామని స్పష్టం చేశారు. కాసేపట్లో వామపక్షాల ఉమ్మడి సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. బలం ఉన్నచోట కమ్యూనిస్టు పార్టీలు పోటీ చేస్తాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news