భట్టి పాదయాత్రపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

-

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర పై కీలక వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. నేడు ఖమ్మం జిల్లా తల్లంపాడు వద్ద పాదయాత్ర శిబిరంలో భట్టి విక్రమార్క తో భేటీ అయ్యారు రేవంత్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, మాజీ ఎంపీ మల్లు రవి. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. భట్టి చేస్తున్న పాదయాత్ర తెలంగాణ కోసమేనని.. పాదయాత్రలోని అంశాలే కాంగ్రెస్ మేనిఫెస్టో గా ఉంటాయని చెప్పారు.

ప్రజల కష్టాలను బట్టి విక్రమార్క దగ్గర నుండి చూశారని అన్నారు. అభివృద్ధి పేరుతో సీఎం కేసీఆర్ చూపిస్తున్న భ్రమలని ఈ పాదయాత్ర పటాపంచలు చేసిందన్నారు. కేసీఆర్ చేతిలో మోసపోయిన బాధితులను బట్టి కలిసి వారికి భరోసా కల్పించారని తెలిపారు. ఇక ఖమ్మంలో జూలై రెండవ తేదీన జరిగే సభకు రాహుల్ గాంధీ హాజరవుతారని తెలిపారు. ఖమ్మం వేదికగా కాంగ్రెస్ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తుందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news