కుప్పంలో దొంగ ఓట్లు నమోదు చేయించింది చంద్రబాబే: MP మిథున్ రెడ్డి

-

రాజంపేట ఎంపీగా ఉన్న వైసీపీ నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చంద్రబాబుపై విమర్శలు చేశాడు. ఈయన తాజాగా మాట్లాడుతూ చంద్రబాబు సొంత నియోజకవర్గం అయిన కుప్పం లో ప్రతిసారీ ఎలా గెలుస్తున్నాడో నాకు అర్ధం కావడం లేదన్నారు. అందులో భాగంగా ఓటర్ల జాబితాను పరిశీలిస్తే కుప్పంలో ఉన్న ఓటర్ లిస్ట్ లో దాదాపుగా వేల సంఖ్యలో దొంగ ఓట్లు నమోదు చేయించి ఉన్నారని మిథున్ రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారు. గత ఎన్నికలకు ముందు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల బోగస్ ఓట్లను భారీగా నమోదు చేయించారని చెప్పాడు మిథున్ రెడ్డి. ఈ దొంగ ఓట్లను తొలగించాలని ఎన్నికల సంఘానికి విన్నవించామని మిథున్ రెడ్డి తెలిపారు.

దొంగ ఓట్ల ద్వారా ఇంతకాలం చంద్రబాబు కుప్పంలో గెలుస్తూ వచ్చారని.. వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తారో మేము చూస్తామన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news