కేటీఆర్ ఢిల్లీ టూర్ పై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

-

మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటన పై కీలక వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఐటి దాడుల నుండి తప్పించేకునేందుకు, సొంత ఆస్తుల చిట్టా బయటికి రాకూడదనే ఉద్దేశంతోనే కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు అంటూ విమర్శించారు. ఢిల్లీలో ఎన్ని పర్యటనలు చేసినా గల్లీలో ప్రజలు నమ్మరని.. సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి లొంగిపోయారని అన్నారు. కెసిఆర్ – మోడీది ఫెవికాల్ బంధమని, కాంగ్రెస్ తోనే తెలంగాణకు కేసిఆర్ నుండి విముక్తి కలుగుతుందని అన్నారు.

కేటీఆర్ సొంత కంపెనీ పై ఐటి దాడులు జరిగాయని.. ఆ రహస్య ఆస్తుల వివరాలు బయటపడ్డాయని అన్నారు. లక్ష కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. లక్ష కోట్లు దోచుకున్న కేసీఆర్ పై కేంద్రం ఒక్క కేసు కూడా పెట్టిందా..? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news