సికింద్రాబాద్‌లో కిషన్ రెడ్డి జోరు.. రెండు రౌండ్లలో ఆధిక్యం

-

సికింద్రాబాద్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హవా కొనసాగుతోంది. సికింద్రాబాద్‌లో తొలి రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. 11,677 ఓట్ల ఆధిక్యంలో కిషన్‌ రెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు. మరోవైపు ఫలితాల వేళ కిషన్ రెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజల ఆశీర్వాదం బీజేపీకి ఉందని కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అమ్మవారి ఆశీస్సులతో బీజేపీ భారీ విజయం సాధించబోతుందని కిషన్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.

రెండో వారంలో ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు బీజేపీకి వస్తాయన్నారు. మోదీ మరోసారి ప్రధాని కావాలని తెలంగాణ ప్రజలు ఆకాంక్షించారని చెప్పారు. పూర్తి ప్రశాంత వాతావరణంలో లెక్కింపు జరగాలనీ కోరారు. ప్రధాని మోడీ, బీజేపీ అభ్యర్థులను ఆశీర్వదించాలని భాగ్యలక్ష్మి అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ ను మోడీ పోల్స్ అన్న రాహుల్ గాంధీ.. ఇంకా నయం రీ ఎగ్జిట్ పోల్స్ చేయాలని డిమాండ్ చేయలేదని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news