న్యాయమూర్తుల సంఖ్య పెంచండి.. కేంద్రానికి కిషన్ రెడ్డి లేఖ..!

-

తెలంగాణ హైకోర్టులో మంజూరు చేసిన న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు వినతి పత్రం అందజేశారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 24గా ఉంది. ఈ సంఖ్యను 42కు పెంచాలని కిషన్ రెడ్డి న్యాయశాఖ మంత్రిని కోరారు. కోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరుగుతోందని, ప్రజలకు సత్వర న్యాయం జరగాలంటే జడ్జిల సంఖ్యను పెంచాలని కిషన్ రెడ్డి కేంద్రన్యాయ శాఖ మంత్రిని కోరారు.

ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కాగా, ఇటీవలే కిషన్ రెడ్డి వ్యక్తిగత వెబ్‌సైట్‌ను పాక్ హ్యాకర్లు హ్యాక్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వెబ్‌సైట్‌లో ఆయన వ్యక్తిగత సమాచారం, రాజకీయ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం మాత్రమే ఉందని కిషన్ రెడ్డి కార్యాలయం ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news