సికింద్రాబాద్ అభివృద్ధిపై నేడు కిషన్ రెడ్డి పవర్ పాయింట్‌ ప్రజెంటేషన్

-

లోక్సభ ఎన్నికలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. ఇవాళ రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఆ తర్వాత నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల నేతలు మరింత అప్రమత్తమయ్యారు. లోక్సభ బరిలో ఎలాగైనా మెరుగైన ఫలితాలు సాధించాలని తీవ్రంగా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ మొదటి నుంచి రెండంకెల సీట్లు సాధిస్తామనే ధీమాతో కనిపిస్తోంది. కేంద్రంలోనూ మోదీ పాలనే వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పదేపదే చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో మరింత జోరు పెంచిన కిషన్ రెడ్డి ఇవాళ సికింద్రాబాద్ అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు లోయర్ ట్యాంక్ బండ్ లోని వెంకట్ రాంరెడ్డి ఫంక్షన్ హాల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధికి కేంద్ర మంత్రిగా తాను ఈ ఐదేళ్లలో తెచ్చిన నిధులు, చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కిషన్ రెడ్డి ప్రజలకు వివరించనున్నారు. మరోసారి తనకు ఓటు వేయాల్సిన అవశ్యకతను ప్రజలకు తెలియజేసి ఓటు అభ్యర్థించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news