పాకిస్తాన్‌ కు డబ్బులు పంపిస్తున్నారు..కిషన్‌ రెడ్డి సంచలనం

-

పాకిస్తాన్‌ కు డబ్బులు పంపిస్తున్నారని…ఎంఐఎం నేతలను ఉద్దేశించి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విమోచన దినం నిర్వహించక పోవడం లో మొదటి దోషి కాంగ్రెస్ అయితే … రెండో దోషి కెసిఆర్ అంటూ మండిపడ్డారు. ఏ ముఖం పెట్టుకుని సమైక్యత దినం చేస్తారు…మీరు విమోచన దినం చేసే దమ్ము ధైర్యం లేకపోతే ఇంట్లో కూర్చోండన్నారు.

కానీ చరిత్రను వక్రీకరించకండని… తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తే ముస్లిం లకి ఎలా వ్యతిరేకం అంటూ ప్రశ్నించారు. అసదుద్దీన్ ఓవైసీ, కెసిఆర్ మాట్లాడుకుని ముంచే ప్రయత్నం చేస్తున్నారని.. ఇది మతపరమైన అంశం కాదు… తెలంగాణ అస్తిత్వం కు సంబందించిన అంశం అని వెల్లడించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి. హైదరాబాద్ విమోచన దినం సమైక్యత దినం ఎలా అవుతుందని…కెసిఆర్ పై ఫైర్ అయ్యారు. పోరాటం చేసింది వాస్తవం కాదా, భారత సైన్యం నిజాం సైన్యాన్ని ఓడించి స్వాధీనం చేసుకుంది వాస్తవం కాదా… ఇది ఎలా సమైక్యత అవుతుందన్నారు.
మిగతా సంస్థానాలు విలీనం అయినట్టు ఈ సంస్థానం విలీనం అయిందా…తెలంగాణ ప్రజలు ఆలోచించాలని కోరారు కిషన్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news