అది తప్పని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా : కేటీఆర్

-

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, హుజూర్‌నగర్‌లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, బీమా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం జరిగిన బహిరంగసభలో మాట్లాడారు.

బీఆర్ఎస్ సర్కార్‌ తీసుకున్న రుణాలతో తెలంగాణ భవిష్యత్‌ను తీర్చిదిద్దే పథకాలపై పెట్టుబడి పెట్టిందని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఏ ప్రధాని హయాంలో చేయని విధంగా అప్పులు చేసిన మోదీ చేసిన ఒక్క మంచి పనైనా చెప్పగలరా? అని సవాల్‌ విసిరారు. కేంద్ర నిధులను పక్కదారి పట్టిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ నిధులతో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఇది తప్పని రుజువుచేస్తే మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని కేటీఆర్‌ సవాల్‌ విసిరారు.

Read more RELATED
Recommended to you

Latest news