జమ్మి చెట్టుకు పూజ చేశాం.. ఇక క్షేత్ర స్థాయిలో దిగుతాం – KTR

-

జమ్మి చెట్టుకు పూజ చేశాం.. ఇక క్షేత్ర స్థాయిలో దిగుతామని రేవంత్‌ రెడ్డికి వార్నింగ్‌ ఇచ్చారు కేటీఆర్‌. హైదరాబాద్ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ అండగా ఉంటారన్నారు కేటీఆర్. ఇవాళ గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎమ్మెల్యేలతో మూసీ , హైడ్రాపై చర్చించారు. అనంతరం కేటీఆర్‌ మాట్లాడారు.

ktr revanth

మూసీ ప్రక్షాళన విషయంలో ప్రభుత్వానికి స్పష్టత లేదన్నారు. నాచారం, ఉప్పల్ లో మేమే మూసీ సివరేజ్ ప్లాంట్లు ఏర్పాటు చేశాం. నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు కూలగొడుతున్నారు. కొత్తగా లక్ష 50వేల కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నారు. నల్లగొండకు నీరు ఇవ్వడం ఇష్టం లేదా..? అని ముఖ్యమంత్రి సన్నాయి నొక్కులు నొక్కేది కాదు.. పనికి మాలిన మాటలు అన్నారు.

దాదాపు 50 ఏళ్ల నుంచి కొంత మంది నివాసం ఉంటున్నారు. గరీబోల్లకు నష్టం కాకుండా ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. మనస్సు ఉన్న ముఖ్యమంత్రి ఉంటే మంచి జరుగుతుంది. బీఆర్ఎస్ కూడా మూసీ సుందరీకరణ చేశామని తెలిపారు. పేదలకు అన్యాయం జరుగకుండా చేశామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news