మణిపుర్ ఘటన అనాగరికం.. ట్విటర్​లో కేటీఆర్ ఫైర్

-

మణిపుర్‌లో చోటుచేసుకున్న అమానవీయ ఘటనపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. మణిపుర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనను కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేస్తూ.. ఇది అనాగరిక చర్య అని అన్నారు. జాతుల మధ్య ఘర్షణలతో మహిళలను లైంగిక వేధింపులకు గురిచేయడం అనాగరికమని కేటీఆర్ ట్వీట్ చేశారు. దేశంలో అనాగరికత సాధారణంగా ఎలా మారిపోయిందో చెప్పడానికి ఈ బాధాకర ఘటనలు ఉదాహరణగా నిలుస్తున్నాయని తెలిపారు.

ఈ భయానక హింసాకాండ, శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతినడాన్ని కేంద్ర ప్రభుత్వం మౌనంగా చూస్తోందని కేటీఆర్‌ ఆక్షేపించారు. మణిపుర్‌లో ఇలాంటి ఘటనలు జరుగుతుంటే.. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఎక్కడ ఉన్నారని కేటీఆర్‌ ప్రశ్నించారు.

మరోవైపు ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి నిందితులను కఠినంగా శిక్షిస్తామని.. దేశ ప్రజలకు మాటిస్తున్నానని వాగ్ధానం చేశారు. ఇంకోవైపు ఈ అమానవీయ ఘటనపై సుప్రీం కోర్టు స్పందించింది. ఈ కేసును సుమోటోగా స్వీకరిస్తూ.. దీనిపై ఏం చర్యలు తీసుకున్నారని కేంద్ర సర్కార్​ను, మణిపుర్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

Read more RELATED
Recommended to you

Latest news