మేడిగడ్డ పనులకు అడ్డుపడుతున్న కాంగ్రెస్‌..కేటీఆర్‌ సీరియస్‌ వార్నింగ్‌ !

-

మేడిగడ్డ పనులకు అడ్డుపడుతున్న కాంగ్రెస్‌ కు..కేటీఆర్‌ సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. మరోసారి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రం, రైతుల ప్రయోజనం కంటే రాజకీయమే ముఖ్యం అని తేలిపోయిందని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి చేసిన కామెంట్లకు కౌంటర్‌ ఇచ్చారు కేటీఆర్‌. మేడిగడ్డ దగ్గర కాఫర్ డాం కట్టి, మరమత్తులు చేసి, నీళ్లు ఎత్తిపోసి రైతులను ఆదుకోమని కెసిఆర్ గారు డిమాండ్ చేస్తున్నారు,

ktr on medigadda

డిపార్ట్మెంట్ ఇంజినీర్లు చెయ్యాలి అని రిపోర్ట్ ఇచ్చిన తరువాత, కడతాం అని కూడా L &T company ముందుకు ఒచ్చిందని వెల్లడించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కుత్సితమైన చిల్లర రాజకీయం చేస్తూ, రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతూ, కెసిఆర్ గారిని బద్నాం చెయ్యాలనే ఒకే ఒక అజెండాతో కాఫర్ డాం కట్టకుండా రైతులని నిండా ముంచాలని చూస్తుందని ఆగ్రహించారు. ఇంత నికృష్ట రాజకీయం కేవలం ఎన్నికలలో లాభం కోసమేనా? అంటూ మండిపడ్డారు కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news