ఆల్ ఇండియా పప్పు రాహుల్, తెలంగాణ పప్పు రేవంత్ : KTR

-

ఆల్ ఇండియా పప్పు రాహుల్, తెలంగాణ పప్పు రేవంత్ రెడ్డి అని సెటైర్లు పేల్చారు మంత్రి KTR. నిన్న కాళేశ్వరంలో రాహుల్, రేవంత్ పర్యటన పై మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం అవినీతి అని రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది… వీళ్ళిద్దరూ ఎగేసికొని పోయి కాళేశ్వరం చూసి వచ్చారు.. మహా ఇంజనీర్లు వీళ్ళు బ్రిడ్జి కూలిపోతుంది అని ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

ktr on revanth and rahul

ఎక్ష్పాన్షన్ జాయింట్ (#ExpansionJoint) ను చూపిస్తూ కాళేశ్వరం బ్రిడ్జి కూలిపోతుంది అంటూ ఫోటోలు పెడుతున్నారు. ఇది వీళ్ళ అవగాహన అంటూ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి వరం కాళేశ్వరం, దేశానికి శనేశ్వరం కాంగ్రెస్ పార్టీ అంటూ నిప్పులు చెరిగారు. రాహుల్ గాంధీకి చరిత్ర తెల్వదు, తెలుసుకునే సోయి లేదు..

స్క్రిప్ట్ అన్న మార్చుకో లేదా స్క్రిప్ట్ రైటర్ నన్న మార్చుకో రాహుల్… కాంగ్రెస్ పార్టీ జల యజ్ఞం ఒక ధన యజ్ఞం.. దావూద్ ఇబ్రహీం, చార్లెస్ శోభరాజ్ కంటే డేంజర్ గాడు మీ రేవంత్ రెడ్డి అంటూ ఫైర్ అయ్యారు కేటీఆర్. దేశంలోనే అతిపెద్ద అవినీతి పరుడు.. బ్లాక్‌మెయిలర్, నోటు ఓటు దొంగ, కాంగ్రెస్ పార్టీ టికెట్లను అంగట్ల గొడ్లను అమ్మినట్టు అమ్ముకున్న రేవంత్ అలియాస్ రేటెంత రెడ్డిని పక్కన పెట్టుకుని రాహుల్ మాట్లాడడం దేశంలో అతిపెద్ద వింత అంటూ నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Latest news