రేవంత్ అబద్దాలతో… గోబెల్స్ కూడా సమాధి నుంచి తలదించుకుంటారు – కేటీఆర్

-

సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ అబద్దాలు చూసి గోబెల్స్ కూడా సమాధి నుంచి తలదించుకుంటున్నారని పేర్కొన్నారు కేటీఆర్. 60 ఏళ్ల పాటు తెలంగాణకు గోస పెట్టి, వేల మందిని క్రూరంగా చంపిన పార్టీ కాంగ్రెస్…. తెలంగాణ ప్రయోజనాలను హక్కులను వనరులను దోచుకోవడంలో కాంగ్రెస్, బీజేపీ తోడు దొంగలు అంటూ నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

ktr about Telangana decade

తెలంగాణ హక్కులను కాపాడటంలో రేవంత్ విఫలమైన తీరు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇప్పటికే జల వనరులను తాకట్టు పెట్టిన రేవంత్, సింగరేణి ప్రైవేటీకరణకు బీజేపీకి సహకారం అందిస్తున్నారని వెల్లడించారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గతంలో అడ్డగోలుగా తెలంగాణ గనులను రెండు కంపెనీలకు బీజేపీ కేటాయించినా, బీఆర్ఎస్ వ్యతిరేకించడం వల్లనే అక్కడ మైనింగ్ ప్రారంభం కాలేదని గుర్తు చేశారు. కానీ ఈరోజు గనుల వేలంకు కాంగ్రెస్, బీజేపీ ఒక్కటయ్యాయి….రేవంత్ చెప్పిన రెండు కంపెనీలు గతంలో కాంగ్రెస్-శివసేన ప్రభుత్వ హయాంలో మహారాష్ట్రలో గనులు దక్కించుకున్నాయని చెప్పారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news