KTR: తెలంగాణలో కేటీఆర్ పాదయాత్ర..ముహుర్తం ఇదే?

-

 

KTR: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాదయాత్ర చేసే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.

ktr about Telangana decade

ఈ నేపథ్యంలోనే బీఆర్‌ఎస్‌ పార్టీని కాపాడుకునేందుకు కేటీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారట. పాదయాత్రకు సిద్ధం అవుతున్నారట. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని సమాచారం. ఈ అంశంపై ఫామ్‌ హౌస్‌లో పార్టీకి చెందిన పలువురు కీలక నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని.. దాన్ని తమపై అభిమానంగా మార్చుకోవాలని కేసీఆర్ పేర్కొన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Read more RELATED
Recommended to you

Latest news