ఓటుకు నోటు దొంగ.. మగతనం గురించి మాట్లాడుతున్నావా?: BRS

-

ఓటుకు నోటు దొంగ.. మగతనం గురించి మాట్లాడుతున్నావా? అంటూ సీఎం రేవంత్‌ కు BRS పార్టీ కౌంటర్‌ ఇచ్చింది. ఓటుకు నోటులో అడ్డంగా దొరికి చర్లపల్లి జైలుకి పోయింది దాయాలని చూస్తే ఎట్లా రేవంతూ.. అంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ సెటైర్లు పేల్చింది.

2016 జీహెచ్ఎంసీ, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ సన్యాసం చేస్తానని రెండు సార్లు ఛాలెంజ్ చేసి మాట మీద నిలబడకుండా పారిపోయిన ఓటుకు నోటు దొంగవి నువ్వు మగతనం గురించి మాట్లాడుతున్నావా రేవంతూ.. ఏదో స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని చర్లపల్లి జైలుకు పోయినట్లు నువ్వు నీ బిల్డప్ అంటూ ఎద్దేవా చేసింది బీఆర్‌ఎస్‌ పార్టీ.

అటు BRS పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి నువ్వు మగాడివైతే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 17కు 17 ఎంపీలను గెలిపించి నీ మగతనం చూపించూ అంటూ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కౌంటర్‌ ఇచ్చారు. రేవంత్ రెడ్డి మల్కాజ్‌గిరి ఎంపీగా ఉండి.. మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క ఎమ్మెల్యేను కూడా ఎందుకు గెలిపించలేదని చురకలు అంటించారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి.

 

Read more RELATED
Recommended to you

Latest news