పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

-

ఒక్కొక్క ఇటుక పేర్చి తెలంగాణను అద్భుతమైన రాష్ట్రంగా తయారు చేశామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై శ్వేదపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఆకాశమంత ఎత్తులో అగ్ర రాష్ట్రంగా ఉందని చెప్పారు. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం దేశంలోనే నెంబర్ వన్ గా నిలబెట్టిందని అన్నారు. తెలంగాణ ఆస్థిత్వమే కాదని, ఆస్తులు కూడా సృష్టించారని చెప్పారు. 60 ఏళ్లలో రూ. 4,98,053 కోట్లు ఖర్చు చేశారన్నది శుద్ధ అబద్ధమని కొట్టిపారేశారు.


జనాభా ఆధారంగా తెలంగాణ వాటా అంటూ కాంగ్రెస్ శ్వేదపత్రంలో తప్పుడు లెక్కలు చూపారని అన్నారు. తెలంగాణలో గత పదేళ్ళ ఖర్చు రూ.13,72,930 కోట్లు అని క్లారిటీ ఇచ్చారు. విద్యుత్ రంగంలో బీఆర్ఎస్ చేసిన ఖర్చు రూ.1,37,517 కోట్లు అని వెల్లడించారు. అంతేకాదు విద్యుత్ రంగంలో రూ, 6,87,585 కోట్ల ఆస్తులు కూడా సృష్టించామని చెప్పారు. దేశ రాష్ట్రపతి ముర్ము సొంత ఊరికే మొన్నటి వరకు విద్యుత్ సౌకర్యం లేదని గుర్తు చేశారు. కానీ తెలంగాణలోని ఏ గ్రామంలోనూ కరెంట్ లేకుండా లేదు అని అన్నారు. కాలేశ్వరంలో ఒక బ్యారేజ్ లో చిన్న తప్పు జరిగిందని, దానికి మొత్తం ప్యాకేజీనే తప్పు పడుతున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news