సీఎం రేవంత్ రెడ్డి పై కేటీఆర్ సంచలన ట్వీట్..!

-

లోక్ సభ ఎన్నికల వేళ.. నాయకుల ప్రచారం ఊపందుకుంది. ఓ వైపు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ బస్సు యాత్రలో గులాబీ బాస్ ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తూ.. ముందుకు వెళ్తున్నారు. మరోవైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్ జన జాతర సభల పేరుతో కాంగ్రెస్ అగ్రనేతలతో బహిరంగ సభలను నిర్వహిస్తోంది. ఈ తరుణంలో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇవాళ నిర్మల్ లో కాంగ్రెస్ జనజాతర సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.

ముఖ్యంగా కేటీఆర్.. ఆరు గ్యారెంటీలు కనిపించడం లేదా..? నువ్వు చీర కట్టుకొని ఆడపిల్లలా అందంగా తయారై.. బస్సు ఎక్కు ఆరు గ్యారెంటీలు అమలు అవుతున్నాయో లేదో తెలుస్తాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనికి కౌంటర్ వేశారు కేటీఆర్. రేవంత్ రెడ్డి.. నువ్వు కట్టుకుంటావా..? చీర లేక రాహుల్ గాంధీకి కట్టిస్తావా..? ఎక్కడ ఇస్తున్నారు రూ.2,500 చూపిస్తావా..? మరీ ఇన్ని పచ్చి అబద్దాలా..? తెలంగాణలో ఉన్న 1.67 కోట్ల మంది 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డలు అడుగుతున్నారంటూ ఫైర్ అయ్యారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version