ప్రజల అభిమానానికి పాదాభివందనం : ఎంపీ రఘునందన్ రావు

-

మెదక్ ఎంపీగా గెలిపించిన ప్రతి ఒక్కరికి ఎంపీ రఘునందన్ రావు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నట్లు చెప్పారు. మెదక్ ఎంపీగా రఘునందన్ రావు గెలిచిన అనంతరం బుధవారం తొలిసారి సిద్దిపేట పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు చూపిన అభిమానానికి జీవితకాలం రుణపడి ఉంటానని తెలిపారు.   ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో మూడో సారి కేంద్ర ప్రభుత్వం కొలువుదీరిందన్నారు.

తెలంగాణ ఉద్యమ కారుడిగా, ఈ గడ్డ బిడ్డగా మెదక్ పార్లమెంట్ అభివృద్ధి కోసం పనిచేస్తా అన్నారు. మెదక్ పార్లమెంట్ కీర్తి పెంచే విధంగా పార్లమెంట్ లో పేద ప్రజల గళం వినిపిస్తా అన్నారు.ఎన్డీఏ భాగస్వామ్యాల పక్షాల కుటమీ ఆంధ్రప్రదేశ్ నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్ర బాబు నాయుడికి శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోని 22 రాష్ట్రాల్లో ఎన్డీఏ, భాగస్వామ్య పక్షాలను ప్రజలు ఆశీర్వదించరన్నారు. 6 రాష్ట్రాలు మినహా 22 రాష్ట్రాల్లో ఎన్డీఏ, భాగస్వామ్య పక్షాల నాయకులే సీఎంలుగా ఉన్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news