కువైట్ లో భారీ అగ్ని ప్రమాదం.. 41 మంది సజీవ దహనం

-

కువైట్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 41 మంది సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో ఐదుగురు భారతీయులు మృతి చెందినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

దట్టమైన పొగ వ్యాపించడంతో అపార్ట్‌మెంట్‌లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో  160 మంది ఆ అపార్టుమెంట్ లో ఉన్నట్టు సమాచారం.

 

Read more RELATED
Recommended to you

Latest news