గుండె పోటు కాస్తా..హత్య కేసుగా మార్చేశారు – వల్లభ రెడ్డి తండ్రి

-

గుండె పోటు కాస్తా..హత్య కేసుగా మార్చేశారని ఫైర్‌ అయ్యారు వల్లభ రెడ్డి తండ్రి రంగసాయి రెడ్డి. నల్లగొండ జిల్లా నిడమనూరుకు చెందిన కాంగ్రెస్ నేత ఎడవెల్లి రంగసాయి రెడ్డి కుమారుడు వల్లభ రెడ్డి నిర్వాకం తాజాగా బయటపడింది. పోస్ట్ మార్టం నివేదిక తో అసలు విషయం బయటపడింది. వల్లభ రెడ్డి భార్య లహరిని తీవ్రంగా కొట్టి చంపినట్లుగా పోస్ట్ మార్టం నివేదిక లో వెలుగులోకి వచ్చింది.

అయితే.. ఈ కేసుపై వల్లభ రెడ్డి తండ్రి రంగసాయి రెడ్డి స్పందించారు. లహరి ఇంట్లో కళ్ళు తిరిగి పడిపోగానే…మేము హాస్పిటల్ కు షిఫ్ట్ చేసామన్నారు లహరి తండ్రి ఎలా చెబితే అలా కేసులు పెట్టమని చెప్పాము..గుండె పోటు కాస్తా..హత్య కేసు గా మార్చేశారని ఆగ్రహించారు. లహరి తండ్రి జైపాల్ రెడ్డి కూడా పోలీస్ లకు చెప్పాడు…మా తప్పు లేదు అని..పోస్ట్ మార్టం నివేదిక పూర్తిగా రాక ముందే…నా కొడుకును అరెస్ట్ చేశారని ఫైర్‌ అయ్యారు. నా కుమారుడిపై రాజకీయ కుట్ర జరుగుతోంది..మేము ఎవరికీ హాని తలపెట్టే వాళ్ళము కాదని వెల్లడించారు. లహరి మరణం పై నిజాలు నిదానంగా తెలుస్తాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news