తెలంగాణలో భారీగా పెరగనున్న భూముల ధరలు…!

-

Land prices to rise in Telangana: తెలంగాణ లో భారీగా భూముల ధరలు…పెరగనున్నట్లు సమాచారం అందుతోంది. ఇందులో భాగంగానే… ఇవాళ తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమావేశం నిర్వహించబోతున్నారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు జూబ్లిహిల్స్ లోని MCRHRD లో సమావేశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ లతో ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించనున్నారు.

Land prices to rise in Telangana

ఇక ఈ సమావేశానికి రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ కుమార్ మిట్టల్, సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రార్లు, డిఐజిలు, జాయింట్ డిజిలు, ఐజి, అదనపు ఐజి స్దాయీ అధికారులు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా భూముల మార్కెట్ విలువ పెంపుపై ప్రదాన చర్చ ఉంటుందని సమాచారం. ఉద్యోగుల సమస్యలు, బకాయిలతో పాటు,ఇతర రాష్ట్రాల్లో పర్యటించి వచ్చిన బృందాల నివేదికలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version