తిరుమల అఖిలాండ వద్ద భూమన ప్రమాణం.. అడ్డుకున్న పోలీసులు..!

-

తిరుమల లడ్డూ వివాదం గత కొద్ది రోజుల నుంచి వివాదస్పదంగా మారిన విషయం అందరికీ తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ లడ్డూ గురించి చర్చలు జరుగుతున్నాయి. ఓ వైపు కూటమి నేతలు తిరుమల ప్రసాదంలో కల్తీ జరిగిందని.. రిపోర్టులో వెల్లడి అయిందని చెబుతుంటే.. మరోవైపు డైవర్షన్ రాజకీయాల కోసమే చంద్రబాబు తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసిందని విమర్శిస్తున్నారని ప్రతిపక్ష నేతలు పేర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలకు వెళ్లారు. తాను తప్పు చేసి ఉంటే.. తమ కుటుంబం సర్వనాశనం అవుతుందని భూమన కరుణాకర్ తిరుమల అఖిలాండం వద్ద ప్రమాణం చేశారు. అయితే ప్రమాణం చేస్తుండగానే పోలీసులు అడ్డుకున్నారు. అంతకు ముందు భూమన కరుణాకర్ రెడ్డితో ఎలాంటి రాజకీయాలు మాట్లాడకూడదని సంతకాలు తీసుకున్నారు పోలీసులు. భూమన కర్పూరం హారతితో ప్రమాణం చేశారు. చేస్తుండగానే మధ్యలోనే అడ్డుకున్నారు పోలీసులు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version