ఎస్సై దాష్టికం.. యువకులకు శిరోమండనం.. ఆత్మహత్యాయత్నం..!

-

బాధ్యతయుతమైన హోదాలో ఉండి ఓ ఎస్సై దాష్టికానికి ఒడిగట్టిన అవమానవీయ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. లింగాల ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు స్థానికంగా ఉన్న పెట్రోల్ బంక్ సిబ్బందితో గొడవకు దిగారు. ఈ నేపథ్యంలో బంక్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్సై జగన్ అక్కడికి చేరుకొని ఆ ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నాడు.

అనంతరం వారిని సిబ్బంది సహాయంతో పోలీస్ స్టేషన్ కి తరలించారు. దీంతో ఓ యువకుడు ఎస్సై ముందు తల దువ్వుకున్నాడు. అయితే తమ ముందు తల దువ్వుకున్నాడని ఆగ్రహంతో రగిలి పోయి ఎస్సై ఆ ముగ్గురు యువకులకు శిరోముండనం చేయించాడు. ఈ క్రమంలోనే ఓ యువకుడు ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు అతన్నీ నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. యువకుల పట్ల ఇలా ప్రవర్తించిన ఎస్సై ని ఉన్నతాధికారులు మందలించినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news