తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు.. మే నెలలో 3285 కోట్ల ఆదాయం

-

తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయి. మే నెలలో ఏకంగా 3285 కోట్ల ఆదాయం వచ్చింది. మే నెలలో 3285 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని.. నిన్న ఒక్కరోజే 300 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ అధికారికంగా ప్రకటించింది. మే నెలలో అత్యధికంగా 64,48,469 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి.

30,66,167లక్షల కేసుల లిక్కర్ విక్రయాలు జరిగినట్లు తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 2,55,526 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరిగియాయని.. 3,31,961 లక్షల కేసుల లిక్కర్ విక్రయాలు జరిగినట్లు స్పష్టం చేసింది తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ. 2022 మే నెలలో 55,72,000 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరుగగా.. 27,11,000 లక్షల కేసుల లిక్కర్ విక్రయాలు జరిగాయి.

Read more RELATED
Recommended to you

Latest news