ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురికి లుక్ ఔట్ నోటీసులు

-

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. ఇందులో కీలక వ్యక్తుల పాత్ర వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముగ్గురికి పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్, ఓ ఛానల్ ఎండీకి ఆదివారం నోటీసులు పంపించారు. ప్రణీత్ రావు అరెస్ట్ లో ఈ ముగ్గురు విదేశాలకు వెళ్లడంతో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

అయితే రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావు ని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇంటెలిజెన్స్ పొలిటికల్ వింగ్ లో అదనపు ఎస్పీగా పని చేసిన ఆయన ను అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ప్రణీత్ రావుతో కలిసి భుజంగరావు, తిరుపతి రావు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఇంకెన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తాయో వేచి చూడాలి మరీ.

Read more RELATED
Recommended to you

Latest news