BREAKING: ఇవాళ నాలుగో లిస్ట్ ప్రకటించనున్న బీజేపీ

-

ఇవాళ నాలుగో లిస్ట్ ప్రకటించనుంది బీజేపీ పార్టీ. యూపీ, ఏపీ, రాజస్థాన్, ఒడిశా, బెంగాల్ లో పోటీ చేసే అభ్యర్థులను ఫైనల్ చేసింది సీఈసీ. అర్థరాత్రి వరకు బీజేపీ సీఈసీ మీటింగ్ జరిగింది. అటు ఏపీలో బీజేపీ పోటీ చేసే అభ్యర్థుల లిస్ట్ ఫైనల్ రెడీ అయిందని సమాచారం. ఎన్డీఏ కూటమి పార్టీల అభ్యర్థుల ఖరారుపై తుది కసరత్తు చేసిందట.

బీజేపీ అభ్యర్థుల ఎంపికపై మంతనాలు జరుపుతున్నారట. ఏపీలో 10 అసెంబ్లీ, 6 లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల ఖరారుపై కసరత్తు జరుపుతున్నారట. టీడీపీ నుంచి 5 అసెంబ్లీ, 4 లోక్ సభ స్థానాలు పెండింగ్ ఉన్నాయి. జనసేన ముగ్గురు అభ్యర్థుల మినహా.. మిగిలిన 18 అసెంబ్లీ, 2 లోక్ సభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి అయింది. బీజేపీతో సీట్ల సర్దుబాటుతోనే అభ్యర్థుల ఎంపికలో జాప్యం జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news