KTR : మల్కాజ్ గిరిలో కాంగ్రెస్ ను మడత పెట్టి కొట్టుడే

-

మల్కాజ్ గిరిలో కాంగ్రెస్ ను మడత పెట్టి కొట్టుడే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఉప్పల్ లో జోష్ చూస్తుంటే అధికారంలో మనం ఉన్నామా? కాంగ్రెసోడు ఉన్నాడా అర్దం కావటం లేదు అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి లో గెలుపు మనదే. 420 హామీలు చూసి జిల్లాలో జనం మోసపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం, చేతల ప్రభుత్వం కాదని జనం తెలుసుకున్నారు.

ఇప్పుడు 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ ను బొంద పెట్టుడే అన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడే భాష ను జనం చూసి అస్యహించుకుంటున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. లంకె బిందెలు కోసం దొంగలు తిరుగుతారు. గతంలో రేవంత్ రెడ్డి అదే కావచ్చు నాకైతే తెలియదు అన్నారు. రేవంత్ రెడ్డి లాగా మేము తిట్టగలుగుతాం..మొన్న జరిగిన పలితాలు మన మంచికే వచ్చాయి అనుకుంటున్నాను. చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news