నాకు 800 ఎకరాలు ఉన్నా….రైతు బంధు పడదు – మల్లారెడ్డి

-

నాకు 800 ఎకరాలు ఉన్నా….రైతు బంధు పడదు అంటూ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. నిన్న ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ…ఐదారు ఎకరాలకు తప్పితే.. నేను రైతు బంధు తీసుకోనని వెల్లడించారు. రైతుబంధు నా అకౌంట్లో ఎంత పడుతుందో కూడా నాకు తెలియదన్నారు. రేవంత్‌ రెడ్డి నన్ను బ్లాక్‌ మెయిల్‌ చేశాడని ఫైర్ అయ్యారు.

mallareddy comments on raithu bandhu
mallareddy comments on raithu bandhu

రేవంత్‌ రెడ్డి ఇంత గొప్పోడు ఎలా అయ్యాడు. నన్ను రేవంత్‌ రెడ్డి ఎంతో ఇబ్బంది పెట్టాడని ప్రశ్నించారు. టీడీపీలో ఉన్నప్పుడు ఎంపీ సీటు వదులుకో, లేకపోతే నీ కాలేజీలు బంద్‌ చేయిస్తా అని బెదిరించాడని మంత్రి మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల అఫిడవిట్లో తప్పులుండొచ్చు.. వాటిని సరి చేసుకుంటానని చెప్పారు. చంద్రబాబును నా టాలెంట్‌తో ఇంప్రెస్‌ చేశానని స్పష్టం చేశారు. చంద్రబాబును కలిసి మూడు టికెట్లు కావాలని అడిగా. నాలాంటి వాళ్లు కావాలని చంద్రబాబు రాజకీయాల్లో తీసుకున్నారన్నారు మల్లారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news