రోజురోజుకూ పెరుగుతున్న కూన జోరు.. కుత్బుల్లాపూర్ లో కమలం లీడ్?

-

తెలంగాణలో ఎన్నికల సమరం హోరాహోరీగా సాగుతోంది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ నేతల నామినేషన్ల పర్వం ముగిసింది. ప్రచారం జోరు అందుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ, ప్రజలకు వారు గెలిస్తే ఏమి చేస్తారో చెబుతూ వరాల జల్లులతో నియోజక వర్గ ప్రజలను ముంచేస్తున్నారు.

దేశంలోని అతిపెద్ద పారిశ్రామిక వాడల్లో ఒకటైన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎన్నికలు పోరు రసవత్తరంగా మారింది. ఈ నియోజకవర్గంలో ఆరు లక్షల పైచిలుకు ఓట్లు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో బీసీల ఓట్లే కీలకంగా మారనున్నాయి.  అందుకే ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు గౌడ సామాజిక వర్గం నాయకులే ఎక్కువ మంది గెలిచారు. గతంలో కూన శ్రీశైలం గౌడ్ ఎమ్మెల్యే గా ఉన్నారు. తర్వాత ఒకసారి టిడిపి నుంచి ఒకసారి బిఆర్ఎస్ నుంచి కేపీ వివేకానంద గౌడ్ రెండు సార్లు గెలిచారు. మూడోసారి విజయం సాధించడానికి తన ప్రచారాన్ని మొదలుపెట్టారు.

ఈసారి బిజెపి అభ్యర్థిగా కూన శ్రీశైలం గౌడ్ బరిలోకి దిగారు. నియోజకవర్గ సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న కూన శ్రీశైలం గౌడ్ ప్రజలతో మమేకమవుతూ, వారి కష్టాలను తెలుసుకుంటూ ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు. అధికార పార్టీ అవినీతి బట్టబయలు చేస్తూ ప్రజలకు తెలియజేస్తున్నారు. నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనలో వివేకానంద్ విఫలమయ్యారని శ్రీశైలం గౌడ్ విమర్శిస్తున్నారు.

నియోజకవర్గంలో అభివృద్ధి లేకపోవడం, అధికార పార్టీ పై వ్యతిరేకత, అధికార పార్టీ అవినీతి ఇవి అన్ని కూన శ్రీశైలం గౌడ్ కు అస్త్రాలుగా మారాయి. రోజురోజుకు ప్రచారంలో ముందుకు దూసుకుపోతూ ప్రజలకు చేరువ అవుతున్న శ్రీశైలం గౌడ్ ఈసారి కచ్చితంగా కుత్బుల్లాపూర్ లో విజయం సాధిస్తారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చాప కింద నీరులా కుత్బుల్లాపూర్ లో బీజేపీ బలం పెరుగుతుంది.

కూన శ్రీశైలం గౌడ్ ప్రచారాన్ని, ప్రజలలో ఉన్న ఆదరణను చూసి తట్టుకోలేక ఓటమి భయంతో కేపీ వివేకానంద గౌడ్ దాడి చేశారని సామాన్యుల సైతం విమర్శిస్తున్నారు.

మరి ఇటువంటి తరుణంలో కుతుబుల్లాపూర్ ఓటర్లు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో??? ఎవరిని గెలిపిస్తారో????

Read more RELATED
Recommended to you

Latest news