వీడిన శిరీష మర్డర్ మిస్టరీ.. హత్య చేసింది బావే

-

వికారాబాద్​ జిల్లా పరిగికి చెందిన శిరీష మర్డర్ మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఆమెను చంపింది అక్క భర్త బావ(అనిల్)అని పోలీసులు తేల్చారు. జిల్లా ఎస్పీ ఎన్‌.కోటిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 10వ తేదీన ఇంట్లో వాళ్లతో గొడవ జరగడంతో శిరీష బయటకు వెళ్లింది. ఆమెను వెతుకుతూ ఆమె బావ అనిల్.. వెతకడం ప్రారంభించాడు. ఇంటికి కి.మీ. దూరంలో రోడ్డుపై శిరీష కనిపించడంతో అడ్డుకోగా ఇద్దరి మధ్య మాటామటా పెరిగింది. కర్రతో, చేతులతో కొట్టడంతో ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది.

మరింత కోపోద్రిక్తుడైన అతను అక్కడినుంచి ఆమెను కొట్టుకుంటూ 150 మీటర్ల దూరంలో ఉన్న నీటి కుంట వద్దకు బలవంతంగా లాక్కెళ్లాడు. పగిలిన బీరు సీసాతో ఆమె కళ్లల్లో పొడిచి నీటిలో ముంచడంతో ఊపిరాడక మృతి చెందింది. ప్రాణం పోయిందని నిర్ణయించుకున్న తరువాత సీసాను కుంటలో పడేసి అతను కాళ్లాపూర్‌ వెళ్లకుండా పరిగిలోని ఇంటికి చేరుకున్నాడు.

“శిరీషపై లైంగిక వాంఛ తీర్చుకోవాలని ఏడాది కాలంగా అనిల్‌ పథకం పన్నాడు. ఓ దశలో పెళ్లి చేసుకోవాలని కూడా యత్నించాడు. దీనికి శిరీష అంగీకరించకపోగా ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించింది. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని భావించాడు. వేరే యువకునితో ఫోన్లో మాట్లాడుతుందన్న అనుమానం మరింత పెరిగి కోపం పెంచుకుని హత్యకు పాల్పడ్డాడు” అని పోలీసులు స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news