ప్రధాని ని కలిస్తే పొల్యూట్ అయినట్టు కాదు : మంత్రి పొంగులేటి

-

తాను బీజేపీతో టచ్ లో ఉన్నానని అనడం కరెక్టు కాదని, ప్రధాని కలిస్తే పొల్యూట్ అయినట్లు కాదని, పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్లు నన్ను ట్రోల్ చేస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన తాను బీజేపీతో టచ్ లో ఉన్నానని వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. అంతేగాక రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడేందుకు వెనుకాడబోమని తేల్చి చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీలో సబ్ జూనియర్ అని.. ముఖ్యమంత్రి అని ఆశకు కూడా అర్ధం ఉండాలని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ డబుల్ డిజిట్ ఎంపీ సీట్లు గెలవబోతున్నామని, 14 స్థానాలు గ్యారెంటీగా గెలుస్తామని చెప్పారు.

బీఆర్ఎస్ మీద మేము కక్ష పూరితంగా కేసులు పెడుతున్నామని ఆరోపణలు చేస్తున్నారని, అవన్ని గత ప్రభుత్వంలో వారు అధికార దుర్వినియోగంతో చేసిన తప్పులు ఇప్పులు ఇప్పుడు బయట పడుతున్నాయన్నారు. అలాగే జలాశయాల్లో నీరు లేకపోవడం, పంటలు ఎండిపోవడం వంటి ఫోటోలు, వీడియోలు పెట్టి కొన్ని మీడియా సంస్థలు కాంగ్రెస్ ప్రభుత్వం పై నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నాయని, మా ప్రభుత్వం డిసెంబర్లో ఏర్పడిందని, రాబోయే ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని నీటి నిల్వలు ఉంచాల్సిన బాధ్యత వారిపై ఉంది కాని చేయాల్సిన పనులు చేయకుండా భాద్యత విస్మరించి మాపై రాళ్ళేయడం తగదని అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news