ప్రతి నెల పట్టణాలు, గ్రామాల్లో సభలు నిర్వహించాలి: సీఎం రేవంత్

-

ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ప్రతి నెల మొదటివారంలో పట్టణాలు, గ్రామాల్లో సభలు నిర్వహించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇలా చేస్తే ప్రజలు హైదరాబాద్ దాకా వచ్చే అవసరం తగ్గుతుందన్నారు. ప్రజల నుంచి వచ్చే ఆయా దరఖాస్తులు ఏ దశలో ఉన్నాయో వారికి తెలపాలని విజ్ఞప్తులు, ఫిర్యాదులను డిజిటలైజ్ చేయాలన్నారు.

Meetings should be held in towns and villages every month said CM Revanth

అలాగే, తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కు జడ్ ప్లస్ భద్రత ని తొలగించి y క్యాటగిరి భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.వై కేటగిరి అంటే కేసీఆర్ కు 4ప్లస్ 4 గన్ మెన్లతో పాటు ఇంటి దగ్గర కూడా సెంట్రీ ఉంటుంది. కాన్వాయ్ కోసం ప్రభుత్వం ఒక వాహనాన్ని ఏర్పాటు చేస్తుంది. అలాగే మాజీ మంత్రులుగా కొనసాగి ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వారికి 2ప్లస్ 2 భద్రతను కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news