Rohith Sharma : ముంబై జెర్సీలను తగలబెట్టిన రోహిత్ ఫ్యాన్స్

-

Rohith Sharma : ముంబై జెర్సీలను తగలబెట్టారు రోహిత్ ఫ్యాన్స్. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పుపై రోహిత్ శర్మ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదు ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మకు కనీస గౌరవం ఇవ్వలేదని, ఆకస్మాత్తుగా తొలగించారని ఫైర్ అవుతున్నారు.

Rohit Sharma series on mumbai indians
Rohit Sharma series on mumbai indians

దేశంలోని పలు నగరాల్లో ముంబై జెర్సీలను కాల్చి వేస్తున్నారు. ఇన్ని రోజులు హిట్ మ్యాన్ పై ఇష్టంతోనే ముంబై ఇండియన్స్ ను సపోర్ట్ చేశామని, ఇకనుంచి పట్టించుకోమని పోస్టులు చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ సీజన్ కి ముంబై టీంకి హార్దిక్ పాండ్యా సారధిగా ఎంపిక అయ్యాడు. ముంబై యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అతనిని కెప్టెన్సీగా ఎంచుకున్నట్టు మహేళా జయవర్ధనే తెలిపాడు. సచిన్ నుంచి హర్భజన్ వరకు టీం కి ఎన్నో సేవలు చేస్తూనే టీం బలోపేతం చేయడానికి దోహదం చేశారు. ఈ తత్వ శాస్త్రానికి అనుకూలంగానే అతనిని కెప్టెన్ చేసినట్లు తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Latest news