ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మేఘాలయ సీఎం సంగ్మా భేటీ

-

ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మేఘాలయ సీఎం సంగ్మా సమావేశమయ్యారు. హైదరాబాద్ వచ్చిన సంగ్మా ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయణ్ను సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్… తేనీటి విందు ఆతిథ్యమిచ్చారు. కాసేపు ఇరువురు ముఖ్యమంత్రులు ఇష్టాగోష్ఠిగా పలు అంశాలపై మాట్లాడుకున్నారు. అనంతరం కేసీఆర్.. సంగ్మాన శాలువాతో సత్కరించి, మెమొంటో బహుకరించారు. తిరుగు ప్రయాణమైన మేఘాలయ సీఎం సంగ్మాకు ముఖ్యమంత్రి కేసీఆర్ వీడ్కోలు పలికారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, పలువురు ప్రజాప్రతినిధులు, ఆ భేటీలో పాల్గొన్నారు.

అయితే కేసీఆర్ దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో మేఘాలయ సీఎంతో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్రంలో బీజేపీని పారద్రోలి.. తెలంగాణ మోడల్ పాలన దేశవ్యాప్తం చేయాలని కేసీఆర్ కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసమే టీఆర్ఎస్​ను బీఆర్ఎస్ చేసి.. దేశ వ్యాప్తంగా ఆ పార్టీ కార్యకలాపాలు క్రియాశీలం చేస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో ఈ పార్టీ చాలా యాక్టివ్​గా ఉంటున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news