మరో మూణ్నెళ్లలో బీఆర్ఎస్లో ముగ్గురు ఎమ్మెల్యేలే ఉంటారు : మంత్రి కోమటిరెడ్డి

-

కోడ్ వల్ల రైతు బందు, రుణమాఫీ ఇవ్వలేకపోయామని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఎన్నికల కోడ్ ముగిశాక అన్ని హామీలు నెరవేరుస్తామని చెప్పారు. కేసీఆర్, జగన్ కుట్రల వల్ల కృష్ణా జలాల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆ రోపించారు. ఎమ్మెల్యేలను కొనాలని బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారన్న మంత్రి కోమటిరెడ్డి ఈ లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క ఎంపీ సీటు కూడా రాదని సవాల్ చేస్తున్నానని అన్నారు. దమ్ముంటే కాంగ్రెస్‌ను, మమ్మల్ని టచ్ చేసి చూడండని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ను పునాదులతో సహా లేపేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

komatireddy on kcr

‘3 నెలల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే బీఆర్ఎస్లో మిగులుతారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే. 12 నుంచి 13 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ గెలుస్తుంది. బీఆర్ఎస్ కు ఒక్క ఎంపీ సీటు వచ్చినా నేను దేనికైనా సిద్ధం. కేసీఆర్ కుటుంబ దగా వల్ల కవిత బలైంది. కేసీఆర్, కేటీఆర్ త్వరలో జైలుకి పోవడం ఖాయం. చర్లపల్లి జైలులో డబుల్ బెడ్ రూమ్ కట్టించి స్వాగతం పలుకుతాం. రేపటి నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అంటే ఏంటో చూపిస్తా’ అంటూ మంత్రి కోమటిరెడ్డి హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news