BREAKING : ఈటలతో ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్

-

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ హాల్లో ఆసక్తికరమైన సంభాషణ చోటు చేసుకుంది. గవర్నర్ స్పీచ్ కు ముందు శాసనసభలో ఆసక్తికరమైన సన్నివేశం జరిగింది. బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల, రఘునందన రావు, రాజసింగ్ వద్దకొచ్చి ప్రత్యేకంగా మాట్లాడారు మంత్రి కేటీఆర్. ఈటలతో ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్…
హుజురాబాద్ లో జరిగిన అధికారిక కార్యక్రమంలో ఎందుకు పాల్గొనలేదని ఈటలను కేటీఆర్ ప్రశ్నించినట్లు సమాచారం.

పిలిస్తే కదా హాజరైయ్యేదంటూ సమాధానం ఇచ్చారు ఈటల రాజేందర్‌. ప్రభుత్వ విధానాలు ప్రజల్లోకి వెళ్ళే ప్రాక్టీస్ సరిగా లేదని కేటీఆర్ కు హితవు పలికారు ఈటల. ఇక ఈటల, కేటీఆర్ సంభాషణ మధ్యలో ఎంట్రీ ఇచ్చారు సీఎల్పీ నేత భట్టి. తనను సైతం అధికారిక కార్యక్రమాలకు పిలువటంలేదంటూ ప్రస్తావించిన భట్టీ…కనీసం కలెక్టరేట్ అయినా ఆహ్వానించాలన్నారు ఈటల. ఈటల వ్యాఖ్యలకు నవ్వి ఊరుకున్నారు మంత్రి కేటీఆర్. ఇక కేటీఆర్ కంటే ముందు ఈటల వద్దకొచ్చి ప్రత్యేకంగా మాట్లాడారు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్.

Read more RELATED
Recommended to you

Latest news