కరీంనగర్‌లో నేడు ఆశీర్వాద సభ..పాల్గొననున్న మంత్రి కేటీఆర్

-

కరీంనగర్ లోని పద్మానగర్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద నేడు మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా ప్రజా ఆశీర్వాదసభ జరగనుంది. సభకు కావాల్సిన ఏర్పాట్లపై మంత్రి గంగుల కమలాకర్ సమీక్షించారు. పార్టీ శ్రేణులకు సభ నిర్వహణపై పలు సూచనలు చేశారు. మేయర్ సునీల్ రావు, బీఆర్ఎస్ నగరాధ్యక్షులు చల్ల హరిశంకర్, రాష్ట్ర ఒలంపిక్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు నందెల్లి మహిపాల్, కార్పొరేటర్ వంగపల్లి రాజేందర్ రావు ఉన్నారు.

ఇది ఇలా ఉండగా, అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఇవాళ మరో రెండు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. తోలుత జడ్చర్ల, ఆ తర్వాత మేడ్చల్ లో జరిగే బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని గులాబీ బాస్ ప్రసంగించనున్నారు. జడ్చర్ల గంగాపూర్ రోడ్డు శివాలయం సమీపంలో సభను నిర్వహించనుండగా…. మేడ్చల్ లో గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో 15 ఎకరాల్లో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news