మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో తనకు చాలామంది మిత్రులు ఉన్నారని.. వచ్చే ఎన్నికల్లో మేడ్చల్ కాంగ్రెస్ అభ్యర్థిని తానే నిర్ణయిస్తానని వ్యాఖ్యానించారు. నేడు అసెంబ్లీ లాబీలో చిట్ చాట్ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో కేఎల్ఆర్ కు తానే టికెట్ ఇప్పించానని.. తమ మనుషులే మేడ్చల్ కాంగ్రెస్ నేతల మధ్య గొడవలు సృష్టిస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇక తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అంటే తన పోస్ట్ ఊడుతుందని కొందరు ప్రచారం చేశారని.. కానీ రేవంత్ రెడ్డిపై తొడగొట్టాక తన గ్రాఫ్ పెరిగిందన్నారు. కొంతమంది కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలోనే మీడియా సంస్థ ఏర్పాటు చేస్తానని.. తెలంగాణ యాసలో ఏడాదికి నాలుగు సినిమాలు తీస్తానని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news