తెలంగాణలో 67 వేలకు చేరిన వరద బాధితుల సంఖ్య..!

-

ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో 117 గ్రామాలలో 67 వేల మంది భారీ వర్షాలు, వరదల వల్ల ప్రభావితమయ్యారు అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఇందులో ఖమ్మం జిల్లాలోనే 49 వేల మంది ఉన్నారు. అలాగే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 133 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసి 10,538 మందిని తరలించాము. ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలవల్ల 3039 మందిని రక్షించుకోగలిగాం అని పేర్కొన్నారు.

అలాగే ప్రాథమిక అంచనా ప్రకారం ఇప్పటి వరకు 44 ఇండ్లు పూర్తిగా దెబ్బతినగా 600 ఇండ్ల వరకు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అయితే ఇండ్లు పూర్తిగా కోల్పోయిన వారికి కొత్తగా మంజూరు చేయాలని, పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు మరమ్మతులను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించాము. అదే విధంగా 51 బ్రిడ్జిలు, 249 కల్వర్ట్స్, 166 ట్యాంక్ లు దెబ్బతిన్నాయని. 13,342 జీవాలు మృతి చెందాయి అని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news