పీవీకి భారతరత్న ప్రకటించాలి – మంత్రి తలసాని

-

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పీవీ 18వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని పివి ఘాట్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన తలసాని, పివి గొప్ప రాజనీతిజ్ఞుడని కొనియాడారు.

పీవీ బహుభాషా కోవిదుడన్న మంత్రి, నూతన ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పథకంలోకి తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి అని ప్రశంసించారు. అటు సీఎం కేసీఆర్‌ కూడా భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు నివాళులు అర్పించారు. పివి గొప్ప రాజనీతిజ్ఞుడని కొనియాడారు. పీవీ బహుభాషా కోవిదుడని తెలిపారు సీఎం కేసీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news