ఏందయ్యా ఈ రోడ్లు.. ఇట్లుంటే ఓట్లెట్ల పడ్తయ్?.. ఏపీ అధికారితో మంత్రి తుమ్మల

-

ఏపీ రహదారుల గురించి చాలా కాలంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి ఆ సమస్య తెలంగాణకు అంటుకుంది. ఏకంగా రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏపీ రహదారుల స్థితిపై స్పందించారు. స్పందించడమే కాదు ఆ విషయంపై అక్కడి అధికారులతో మాట్లాడారు. ఈ రోడ్లు చూసి జనాలు ఓట్ల ఎలా వేస్తారని ప్రశ్నించారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?

మంత్రి తుమ్మల బుధవారం రోజున భద్రాచలం నుంచి దుమ్ముగూడెం వెళ్తూ రెండు రాష్ట్రాల సరిహద్దుల్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక- కన్నాయిగూడెం రహదారిలో ప్రయాణించారు. ఎటపాక, చింతలగూడెం, కన్నాయిగూడెం ప్రాంతాల్లో పెద్దపెద్ద గుంతలు ఉండటంతో అసహనం వ్యక్తం చేసిన తుమ్మల.. అక్కడి నుంచే ఏపీ ఆర్‌అండ్‌బీ సీఈ శ్రీనివాసరెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు.

‘ఎటపాక- కన్నాయిగూడెం మధ్యలో ఆర్‌అండ్‌బీ రోడ్డు నిండా గోతులే ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ఆర్‌అండ్‌బీ మంత్రిగా పని చేశాను. దుమ్ముగూడెం- చర్ల రోడ్డు పనులు చేయిస్తున్నప్పుడే ఎటపాక నుంచి కన్నాయిగూడెం గ్రామాల మధ్య ఈ 8 కి.మీ. దూరం రోడ్డు వేయించాను. ఆ తర్వాత కనీసం మరమ్మతులు చేయించలేదు. ఈ రోడ్డు ఇట్లా ఉంటే మీ ప్రభుత్వానికే ఓట్లు పడవు. మీరు చేయలేకపోతే మేమే ప్యాచ్‌ వర్క్స్‌ చేయిస్తామ’ని అన్నారు. మంత్రి ఫోన్‌కాల్‌పై స్పందించిన సీఈ శ్రీనివాసరెడ్డి.. త్వరలో మరమ్మతులు చేస్తామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news