మిస్ వరల్డ్ – 2025 పోటీలను రద్దుచేయాలి : విశ్వహిందు పరిషత్

-

మిస్ వరల్డ్ పిస్కోవాతో సహా 111 దేశాల నుంచి సుందరీమణులంతా హైదరాబాద్ కు చేరుకున్నారు. రేపటి నుంచి హైదరాబాద్ లో మిస్ వరల్డ్ -2025 పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనే భామలు, న్యాయ నిర్ణేతలు, అతిథులు అంతా ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. భారత్ – పాక్ ల మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లో అందాలపోటీల్లో ఎలాంటి తప్పిదం జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేశారు.

ఈ క్రమంలో నగరంలో మిస్ వరల్డ్ పోటీలను రద్దు చేయాలని విశ్వహిందూ పరిషత్ (VHP) డిమాండ్ చేసింది. శత్రుదేశాల ప్రతి నిధులతో పోటీలు ఎలా జరుపుతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. చొరబాటు దారులను వెంటనే హైదరాబాద్ నుంచి వెనక్కి పంపించాలని విశ్వహిందూ పరిషత్ కోరింది.

Read more RELATED
Recommended to you

Latest news